రోడ్డుపై ఆరుగొలను గ్రామస్థుల బైఠాయింపు
ABN , First Publish Date - 2021-10-27T05:56:27+05:30 IST
క్వారీ లారీల దుమ్ముతో తమకు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, లారీలను నియం త్రించాలని కోరుతూ ఆరుగొలను ప్రజలు రోడ్డుపై బైఠాయించారు.
తాడేపల్లిగూడెం రూరల్, అక్టోబరు 26: క్వారీ లారీల దుమ్ముతో తమకు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, లారీలను నియం త్రించాలని కోరుతూ ఆరుగొలను ప్రజలు రోడ్డుపై బైఠాయించారు. గ్రామంలో లారీల భయంతో ఇళ్లలోనుంచి బయటకు రాలేకపోతున్నా దుమ్ము మాత్రం మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు స్వచ్ఛందంగా రోడ్డుపైకి వచ్చి ధర్నా చేయడం అంటే వారిలో ఎంత వేదన ఉంటే వస్తారని సీపీఎం మండల కార్యదర్శి కండెల్లి సోమరాజు పేర్కొన్నారు. ధర్నాలో టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి షేక్ ఖాదర్బాబు, వార్డు సభ్యులు కాసాని రాజేష్, వీరమల్లు సీతారత్నం, చిటకన సూరిబాబు, కట్టా సత్యనారాయణ పాల్గొన్నారు.