గ్రామ వలంటీర్ ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-02-23T06:49:44+05:30 IST
రంపచోడవరంలో ఓ గ్రామ వలంటీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ నసీరుల్లా వివరాల ప్రకారం..
రంపచోడవరం, ఫిబ్రవరి 22: రంపచోడవరంలో ఓ గ్రామ వలంటీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ నసీరుల్లా వివరాల ప్రకారం.. రంపచోడవరం వాల్మీకిపేటకు చెందిన లండా సుబ్రమణ్యం(25) కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తరచూ గుండెనొప్పి రావడంతో మనోవేదనకు గురయ్యేవాడు. శుక్రవారం రంప శివాలయాన్ని దర్శించుకుని వాల్మీకిపేటలో నివాసం ఉంటున్న ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఎవ్వరులేని సమయంలో పక్కనే ఖాళీగా ఉన్న ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.