నెల్లూరు జిల్లాలో మహిళా మృతదేహంతో గ్రామస్తుల ధర్నా
ABN , First Publish Date - 2021-07-09T03:29:15+05:30 IST
జిల్లాలోని ఇందుకూరుపేట మండలంలో గల నరసాపురం గ్రామంలో లలిత అనే గిరిజన మహిళా
నెల్లూరు: జిల్లాలోని ఇందుకూరుపేట మండలంలో గల నరసాపురం గ్రామంలో లలిత అనే గిరిజన మహిళా మృతదేహంతో రోడ్డుపై గ్రామస్తులు ధర్నా చేశారు. ఇటీవల హరి అనే వ్యక్తి మద్యం మత్తులో లలితను బైక్తో ఢీ కొట్టాడు. దీంతో లలిత కోమాలోకి వెళ్లింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ లలిత మృతి చెందింది. లలితకు న్యాయం చేయాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేశారు.