‘స్వచ్ఛ సంకల్పం’తో గ్రామాలు పరిశుభ్రం
ABN , First Publish Date - 2021-05-07T05:33:27+05:30 IST
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకగా చేపట్టిన స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంతో గ్రామాలు పరిశుభ్రంగా ఉంటాయని జడ్పీ సీఈవో బి.లక్ష్మీపతి తెలిపారు.
రణస్థలం: ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకగా చేపట్టిన స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంతో గ్రామాలు పరిశుభ్రంగా ఉంటాయని జడ్పీ సీఈవో బి.లక్ష్మీపతి తెలిపారు. స్వచ్ఛ సంకల్ప కార్యక్రమంలో భాగంగా గురువారం జేఆర్పురంలో చేపట్టిన పారిశుధ్యం పనులను ఆయన పరిశీలించారు. ఈ నెల 31 వరకూ ఈ పనులు జరుగుతాయన్నారు. కాలువల్లో పూడిక తీయడం, వీధుల్లో చెత్త లేకుండా చూడడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. వర్షాకాలం ప్రారంభమయ్యిందని, ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయనతో పాటు ప్రత్యేకాధికారి పంచాది రాధ, ఎంపీడీవో బి.శైలజ తదితరులు పాల్గొన్నారు.