పల్లె ప్రగతితో సుందరంగా గ్రామాలు: ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2021-03-03T05:38:53+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న పల్లె ప్రగతి పనులతో గ్రామాలు సుందరంగా తయారవుతున్నాయని ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు అన్నారు.
నేరడిగొండ, మార్చి 2: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న పల్లె ప్రగతి పనులతో గ్రామాలు సుందరంగా తయారవుతున్నాయని ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు అన్నారు. మంగళవారం ఎంపీపీ రాథోడ్ సజన్ అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ జాదవ్ అనిల్, బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ దావుల భోజన్న, మండల ఉపాధ్యక్షుడు మహేందర్రెడ్డి, ఎంపీడీవో సుధాకర్రెడ్డి, తహసీల్దార్ శ్రీదేవి పాల్గొన్నారు.