వినాయక ఉత్సవాల్లో పర్యావరణ స్పృహ
ABN , First Publish Date - 2021-09-13T23:10:07+05:30 IST
వినాయక ఉత్సవాల్లో పర్యావరణ స్పృహ
హైదరాబాద్: పీర్జాదీగూడ పర్వతాపూర్ స్పాంజిల్లా గేటెడ్ కమ్యూనిటీలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో 200కు పైగా కుటుంబాలు ఉత్సాహంగా పాల్గొంటున్నాయి. మట్టి గణపతి విగ్రహం ఏర్పాటు చేయడమే కాకుండా చిన్నారులలో పర్యావరణ స్పృహ కల్గించడానికి మట్టితో వినాయక ప్రతిమల తయారు పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు.
కమ్యూనిటీకి చెందిన బాలబాలికలు రోజూ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తున్నారు. కమెడియన్ రాకింగ్ రాకేశ్ వేడుకలకు హాజరై సందడి చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వందలాది మంది ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. అన్న ప్రసాద వితరణ, గణపతి హోమం నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. నీటిని చిమ్మడం ద్వారా విగ్రహాన్ని కాలనీలోనే నిమజ్జనం చేయనుండడం విశేషం.