ప్రజాసేవే అంతిమలక్ష్యం కావాలి

ABN , First Publish Date - 2021-03-10T19:51:36+05:30 IST

రాజకీయాల్లో పదవులు ముఖ్యం కాదని, ప్రజాసేవే అంతిమ లక్ష్యం

ప్రజాసేవే అంతిమలక్ష్యం కావాలి

వరంగల్: రాజకీయాల్లో పదవులు ముఖ్యం కాదని, ప్రజాసేవే అంతిమ లక్ష్యం కావాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పాలకవర్గం చివరి సమావేశం ఈ రోజు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవులు లేకపోయినా ప్రజాసేవలో ఉండాలని ఆయన పేర్కొన్నారు. పాలకవర్గం చివరి సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-10T19:51:36+05:30 IST