రామ మందిరం నిర్మాణానికి రూ.లక్ష విరాళం
ABN , First Publish Date - 2021-01-21T04:19:19+05:30 IST
రామ మందిరం నిర్మాణానికి రూ.లక్ష విరాళం
ములుగుటౌన్, జనవరి 20: శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి ములుగు పట్టణానికి చెందిన మంజునాథ రియల్ ఎస్టేట్ అధినేత బండారి మోహన్కుమార్ రూ.లక్ష విరాళంగా అందజేశారు. ధర్మజాగరణ సమితి ప్రముఖ్ వెంకట్కు చెక్కు అందించి మాట్లాడారు. ఈ పవిత్ర యజ్ఞంలో నా వంతు సహాయం చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు చింతలపూడి భాస్కర్రెడ్డి, బాణాల సుధాకర్, ముక్కు సబ్బారెడ్డి, భాషబోయిన మహేందర్, నగరపు రమేష్, దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, చల్లూరి మహేందర్, సిరికొండ బలరాం, కొండారెడ్డి, కిషోర్ నాయక్ పాల్గొన్నారు.