రామ మందిరం నిర్మాణానికి రూ.లక్ష విరాళం

ABN , First Publish Date - 2021-01-21T04:19:19+05:30 IST

రామ మందిరం నిర్మాణానికి రూ.లక్ష విరాళం

రామ మందిరం నిర్మాణానికి రూ.లక్ష విరాళం

ములుగుటౌన్‌, జనవరి 20: శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి ములుగు పట్టణానికి చెందిన మంజునాథ రియల్‌ ఎస్టేట్‌ అధినేత బండారి మోహన్‌కుమార్‌ రూ.లక్ష విరాళంగా అందజేశారు. ధర్మజాగరణ సమితి ప్రముఖ్‌ వెంకట్‌కు చెక్కు అందించి మాట్లాడారు. ఈ పవిత్ర యజ్ఞంలో నా వంతు సహాయం చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు చింతలపూడి భాస్కర్‌రెడ్డి, బాణాల సుధాకర్‌, ముక్కు సబ్బారెడ్డి, భాషబోయిన మహేందర్‌, నగరపు రమేష్‌, దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, చల్లూరి మహేందర్‌, సిరికొండ బలరాం, కొండారెడ్డి, కిషోర్‌ నాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-01-21T04:19:19+05:30 IST