కిలిమంజారో ఎక్కిన ఏడేళ్ల చిన్నోడు
ABN , First Publish Date - 2021-03-08T09:16:21+05:30 IST
ముఖ పర్వతారోహకుడు తమ్మినేని భరత్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్కు చెందిన విరాట్ చంద్ర..
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ప్రముఖ పర్వతారోహకుడు తమ్మినేని భరత్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్కు చెందిన విరాట్ చంద్ర అనే ఏడేళ్ల బాలుడు కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాడు. కిలిమంజారో (5,895 మీటర్లు) ఆఫ్రికా ఖండంలోనే ఎత్తయిన పర్వత శిఖరం కాగా, మొత్తంగా ప్రపంచంలోని ఎత్తయిన శిఖరాల్లో నాలుగవది. ఈనెల 2న మెంటార్ భరత్తో కలిసి యాత్ర ప్రారంభించిన విరాట్ శుక్రవారం పర్వతశ్రేణి శిఖరానికి చేరుకున్నాడు. తెలుగు రాష్ట్రాల నుంచి కిలిమంజారో ఎక్కిన పిన్నవయస్కుడు విరాట్ చంద్రనే కావడం విశేషం.