స్నేహబంధాన్ని గుర్తు చేస్తూ..
ABN , First Publish Date - 2020-05-23T09:18:51+05:30 IST
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ ఎప్పటినుంచో స్నేహితులు. వీరిద్దరు ఎప్పుడు, ఎక్క డ కలిసినా ఆప్యాయంగా
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ ఎప్పటినుంచో స్నేహితులు. వీరిద్దరు ఎప్పుడు, ఎక్క డ కలిసినా ఆప్యాయంగా పలకరించుకుంటూ స్నేహబంధాన్ని చాటుతూనే ఉంటారు. తమ స్నేహాన్ని మరోసారి గుర్తు చేస్తూ.. ఓ టెస్టు మ్యాచ్లో టాస్కు వెళ్లే ముందు తాను విలియమ్సన్ భుజంపై ఆప్యాయంగా చేయి వేసి నడుస్తున్న ఫొటోను కోహ్లీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘మా మధ్య సంభాషణను ఎప్పుడూ ఇష్టపడతా. అతను మంచి మనిషి’ అని ఆ ఫొటోకు క్యాప్షన్ రాసుకొచ్చాడు.