అనుష్కా... అన్నం తిన్నావా?.... మ్యాచ్ మధ్యలో భార్యపై ప్రేమ కురిపించిన కోహ్లీ!

ABN , First Publish Date - 2020-10-29T13:01:51+05:30 IST

సూపర్‌స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్కాశర్మలకు...

అనుష్కా... అన్నం తిన్నావా?.... మ్యాచ్ మధ్యలో భార్యపై ప్రేమ కురిపించిన కోహ్లీ!

న్యూఢిల్లీ: సూపర్‌స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్కాశర్మలకు సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధించినది. ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్‌లు అబూదాబీలో జరుగుతున్నాయి. విరాట్ కోహ్లీకి తోడుగా అనుష్క శర్మ కూడా అబూదాబీ వచ్చారు. ఆర్బీసీ, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ సందర్భంగా అనుష్క శర్మ రెడ్ డ్రెస్ ధరించారు. 



వైరల్ అవుతున్న ఈ వీడియోలో... విరాట్... అనుష్కకు సైగలు చేస్తూ భోజనం చేశావా? అని అడిగాడు. దీనికి అనుష్క సమాధానంగా తన బొటనవేలిని చూపిస్తుంది. దీనిని చూసిన విరాట్ ముసిముసిగా నవ్వుతాడు. ఈ వీడియో అనుష్క, విరాట్ కోహ్లీ అభిమానులను అమితంగా అలరిస్తోంది. కాగా అనుష్క శర్మ 2018లో ‘జీరో’ సినిమాలో షారూఖ్ ఖాన్ సరసన కనిపించారు. ఆ తరవాత ఆమె సినిమాలకు బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

                                        వీడియో ‘టీవీయూ అప్‌డేట్స్’ సౌజన్యంతో...

Updated Date - 2020-10-29T13:01:51+05:30 IST