టీం ఇండియాను ముందుకు నడిపించే సత్తా కోహ్లీకే ఉంది: ఇయాన్ బోథమ్

ABN , First Publish Date - 2020-05-28T21:00:18+05:30 IST

2014లో టీం ఇండియా టెస్ట్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన విరాట్ కోహ్లీ.. ఆ తర్వాత అన్ని ఫార్మాట్లకు కెప్టెన్ అయ్యాడు. అప్పటి నుంచి జట్టుకు ఎన్నో మరుపురాని

టీం ఇండియాను ముందుకు నడిపించే సత్తా కోహ్లీకే ఉంది: ఇయాన్ బోథమ్

లండన్: 2014లో టీం ఇండియా టెస్ట్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన విరాట్ కోహ్లీ.. ఆ తర్వాత అన్ని ఫార్మాట్లకు కెప్టెన్ అయ్యాడు. అప్పటి నుంచి జట్టుకు ఎన్నో మరుపురాని విజయాలను అందించిన విజయవంతంగా కెప్టెన్ పదవిలో కొనసాగుతున్నాడు. అయితే భారత క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకువెళ్లే సత్తా కేవలం విరాట్ కోహ్లీకి మాత్రమే ఉందని.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ బోథమ్ అన్నారు. 


‘‘ప్రత్యర్థుల నుంచి విరాట్ సులువుగా మ్యాచ్‌ని లాగేసుకుంటాడు. తన తోటి ఆటగాళ్లకు అతను అండగా ఉంటాడు. అతనితో మ్యాచ్ ఆడాలని నాకు ఎంతో ఆశగా ఉంది. ప్రస్తుతం టీం ఇండియాను ముందుకు నడిపించే సత్తా విరాట్ కోహ్లీకి మాత్రమే ఉంది’’ అని ఇయాన్ తెలిపారు. 

Updated Date - 2020-05-28T21:00:18+05:30 IST