ధోనీ రిటైర్మెంట్‌పై విరాట్ కోహ్లీ భావోద్వేగ ట్వీట్

ABN , First Publish Date - 2020-08-16T04:15:04+05:30 IST

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ...

ధోనీ రిటైర్మెంట్‌పై విరాట్ కోహ్లీ భావోద్వేగ ట్వీట్

ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. ప్రతి క్రికెటర్ ఒక రోజు తన ప్రయాణాన్ని ముగించాల్సి ఉంటుందని, అయితే.. మీకు బాగా సన్నిహితంగా ఉన్న వ్యక్తి ఆ నిర్ణయాన్ని ప్రకటిస్తే మరింత ఎక్కువగా భావోద్వేగానికి గురవుతారని ధోనీ రిటైర్మెంట్‌పై కోహ్లీ ట్వీట్ చేశాడు. దేశం కోసం నువ్వు అందించిన సేవ ప్రతీ ఒక్కరి హృదయంలో ఎప్పటికీ నిలిచి ఉంటుందని కోహ్లీ ట్వీట్ చేశాడు. నీ నుంచి నాకు దక్కిన పరస్పర గౌరవం నాతో ఎప్పటికీ ఉంటుందని, ప్రపంచం నువ్వు అందుకున్న విజయాలను చూస్తుందని.. నేను నీ వ్యక్తిత్వాన్ని చూశానని ధోనీని ఉద్దేశించి కోహ్లీ ట్వీట్ చేశాడు. రైనా రిటైర్మెంట్‌పై కోహ్లీ స్పందించాడు. ఇప్పటివరకూ కెరీర్‌ను ఉన్నతంగా సాగించినందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు రైనాను ఉద్దేశించి కోహ్లీ ట్వీట్ చేశాడు. మున్ముందు మరిన్ని విజయాలను అందుకోవాలని ఆకాంక్షించాడు.



Updated Date - 2020-08-16T04:15:04+05:30 IST