విశాఖ ఘటన‌పై విచారణ.. సొమ్మసిల్లి పడిపోయిన కనకరాజు భార్య

ABN , First Publish Date - 2020-06-07T18:08:00+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన విశాఖ ఎల్జీ పాలిమార్స్ ఘటనపై హైపవర్ కమిటీ విచారణ జరుపుతోంది.

విశాఖ ఘటన‌పై విచారణ.. సొమ్మసిల్లి పడిపోయిన కనకరాజు భార్య

విశాఖపట్నం : తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన విశాఖ ఎల్జీ పాలిమార్స్ ఘటనపై హైపవర్ కమిటీ విచారణ జరుపుతోంది. రాజకీయపార్టీల నేతలు, స్థానికులతో వేర్వేరుగా సమావేశం నిర్వహిస్తోంది. నగరంలోని జీవీఎంసీలో కమిటీ సభ్యులు ఉండగా.. వారిని కలిసి తమ వాదానను వినిపించడానికి పాలిమర్స్‌ ఘటనలో మృతిచెందిన కనకరాజు భార్య లావణ్య వెళ్లింది. అయితే.. లిస్టులో ఆమె పేరు లేదని లోపలికి  అనుమతించలేదు. ఈ క్రమంలో ప్రధాన గేటు దగ్గర నిలబడి ఉన్న లావణ్య స్పృహ తప్పి పడిపోయింది. అప్రమత్తమైన సిబ్బంది హుటాహుటిన అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు.


అయితే.. కనకరాజు చనిపోయింది గ్యాస్ లీకేజీ కారణంగానే అని కుటుంబ సభ్యులు, బంధువులు చెబుతున్నారు. అయినప్పటికీ ఎవరూ పట్టించుకోకుండా ఇలా చేయడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. హైపవర్ కమిటీ ముందు తమ వాదన వినిపించడానికి జనసేనకు అనుమతివ్వలేదు. దీంతో జీవీఎంసీ గేట్ ముందు జనసేన నేతలు బైఠాయించారు.

Updated Date - 2020-06-07T18:08:00+05:30 IST