విశాఖ ఉక్కును పరిరక్షించుకుందాం

ABN , First Publish Date - 2021-08-02T06:44:18+05:30 IST

శాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఎందరో ప్రాణత్యాగం చేశారని, అలాంటి ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటు పరం అవుతుంటే ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ స్వరూపరాణి అన్నారు.

విశాఖ ఉక్కును పరిరక్షించుకుందాం

మచిలీపట్నం టౌన్‌, ఆగస్టు 1 : విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఎందరో ప్రాణత్యాగం చేశారని,  అలాంటి ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటు పరం అవుతుంటే ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ స్వరూపరాణి అన్నారు.  యూటీఎఫ్‌ హాలులో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో స్వరూ పరాణి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్‌ పరం కాకుండా కేంద్రంపై వత్తిడి తీసుకురావాలన్నారు.  ఆగస్టు 9న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా కార్యక్రమాలు నిర్వహిం చాలన్నారు. మచిలీపట్నం పార్లమెంటు తెలుగురైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ మా ట్లాడుతూ, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని చౌకగా అమ్ముతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు.  సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మోదుమూడి రామారావు, సీపీఎం నాయకులు కొడాలి శర్మ, సిహెచ్‌.రవి, వై. నరసింహారావు, తమ్ము నాగరాజు, దారపు శ్రీనివాసరావు, జి.కిషోర్‌కుమార్‌, ఉమా మహేశ్వరరావు, బసవపున్నయ్య, లింగం ఫిలిప్‌, వేము కోటేశ్వరరావు, అనిల్‌, మత్తి వెంకటేశ్వరరావు, చంద్రపాల్‌, మోహనరావు, సుబ్రహ్మణ్యం, పార్వతీశం  మాట్లాడారు. 

Updated Date - 2021-08-02T06:44:18+05:30 IST