Viskha: టీడీపీ కార్యాలయంలో భోగి మంటలు

ABN , First Publish Date - 2022-01-14T16:20:15+05:30 IST

నగరంలోని టీడీపీ కార్యాలయంలో భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Viskha: టీడీపీ కార్యాలయంలో భోగి  మంటలు

విశాఖపట్నం: నగరంలోని టీడీపీ కార్యాలయంలో భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భోగి మంటలు వేసిన నేతలు.... ప్రభుత్వం ప్రజా వ్యతిరేకంగా తెచ్చిన జీవోలు చెత్త పన్ను పేపర్లను మంటల్లో వేశారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలతో తీసుకున్న నిర్ణయాల జీవో లన్నింటిని, భోగిమంటల్లో వేసి నిరసన తెలియజేసినట్లు తెలిపారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి బుద్ధి మారాలని కోరుకుంటున్నామన్నారు. నేడు ప్రజలు సంక్రాంతి చేసుకోలేని పరిస్థితి నెలకొందని అన్నారు. పన్నుల రూపంలో ప్రభుత్వం ప్రజలకు భారం మోపుతోందని పల్లా శ్రీనివాస్ మండిపడ్డారు. 

Updated Date - 2022-01-14T16:20:15+05:30 IST