విశాఖలో వ్యక్తి అనుమానాస్పద మృతి
ABN , First Publish Date - 2020-09-21T13:59:08+05:30 IST
విశాఖ గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితితో మృతి చెందాడు.
విశాఖపట్నం: విశాఖ గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితితో మృతి చెందాడు. నడిరోడ్డుపై గుర్తుతెలియని వ్యక్తి మంటల్లో కాలుతూ కనిపించాడు. అయితే ఆ వ్యక్తిని ఎవరైనా హత్య చేశారా? లేక ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.