విశాఖలో బైక్ ర్యాలీ...పాల్గొన్న ఎంపీ విజయసాయి

ABN , First Publish Date - 2020-11-20T15:23:19+05:30 IST

స్పీడ్ డ్రైవింగ్, ఈవ్ టీజింగ్‌కి వ్యతిరేకంగా విశాఖ ఆర్కే బీచ్‌లో శుక్రవారం ఉదయం బైక్ ర్యాలీ ప్రారంభమైంది.

విశాఖలో బైక్ ర్యాలీ...పాల్గొన్న ఎంపీ విజయసాయి

విశాఖపట్నం: స్పీడ్ డ్రైవింగ్, ఈవ్ టీజింగ్‌కి వ్యతిరేకంగా విశాఖ ఆర్కే బీచ్‌లో శుక్రవారం ఉదయం బైక్ ర్యాలీ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఎంపీ విజయసాయిరెడ్డి  ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హర్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్కే బీచ్  కాళికాదేవి మందిరం నుంచి రుషికొండ గీతం కాలేజి  వరకు ర్యాలీ కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్ మంత్రి కన్నబాబు, మంత్రి అవంతి శ్రీనివాసరావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-20T15:23:19+05:30 IST