సెల్ఫీ మోజులో యువకుడు గల్లంతు
ABN , First Publish Date - 2021-01-07T18:55:27+05:30 IST
సెల్ఫీ మోజులో నీటి ప్రవాహంలో యువకుడు గల్లంతైన ఘటన విశాఖలో చోటు చేసుకుంది.
విశాఖపట్నం: సెల్ఫీ మోజులో యువకుడు గల్లంతైన ఘటన విశాఖలో చోటు చేసుకుంది. స్నేహితుల కళ్ళ ముందే ఓ యువకుడు నీటిలో మునిగిపోయాడు. విశాఖలోని డుడుమ వాటర్ ఫాల్స్ వద్ద కొందరు స్నేహితులతో కలిసి యువకుడు సెల్ఫీ తీసుకుంటూ నీటి ప్రవాహంలో పడిపోయాడు. జనవరి 1న జరిగిన ఈ విషాధ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.