డిసెంబర్ 24న వైజాగ్ ప్రాపర్టీ ఎక్స్పో
ABN , First Publish Date - 2021-10-23T17:08:17+05:30 IST
క్రెడాయ్ ఆధ్వర్యంలో విశాఖలో గాదిరాజ్ ప్యాలెస్లో డిసెంబర్ 24 నుండి 26 వరకూ మూడు రోజుల పాటు వైజాగ్ ప్రోపర్టీ ఎక్స్ పో నిర్వహిస్తున్నామని క్రెడాయ్ చైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు.
విశాఖపట్నం: క్రెడాయ్ ఆధ్వర్యంలో విశాఖలో గాదిరాజ్ ప్యాలెస్లో డిసెంబర్ 24 నుండి 26 వరకూ మూడు రోజుల పాటు వైజాగ్ ప్రోపర్టీ ఎక్స్ పో నిర్వహిస్తున్నామని క్రెడాయ్ చైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. అందరికి సరసమైన ధరలకు ఫ్లాట్లు అందించే ఉద్దేశ్యంతోనే ఎక్స్ పో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. శనివారం ఉదయం నగరంలోని ఒక ప్రైవేటు హోటల్లో ప్రాపర్టీ ఎక్స్ పో బ్రోచర్ను శ్రీనివాసరావు ఆవిష్కరించారు.