Visakhapatnam: కాలువలోకి దూసుకెళ్లిన కాలేజ్ బస్
ABN , First Publish Date - 2021-11-25T16:10:07+05:30 IST
నగరంలోని పెందుర్తి మండలం రాంపురం గ్రామ శివారులో గాయత్రి ఇంజనీరింగ్ కాలేజ్ బస్సు అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది.
విశాఖపట్నం: నగరంలోని పెందుర్తి మండలం రాంపురం గ్రామ శివారులో గాయత్రి ఇంజనీరింగ్ కాలేజ్ బస్సు అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.