Visakha: తుఫాను నేపథ్యంలో అధికారుల అప్రమత్తం
ABN , First Publish Date - 2021-12-03T16:22:18+05:30 IST
తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.
విశాఖపట్నం: తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ రోజు, రేపు జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి భోజనం అనంతరం పాఠశాలలను మూసి వేయాలని ఆదేశాలు జారీ చేశారు.