Visakha: లోతట్టు ప్రాంతాల్లో జీవీఎంసీ కమిషనర్ పర్యటన
ABN , First Publish Date - 2021-12-04T14:15:55+05:30 IST
నగరంలోని గోపాలపట్నం పరిధిలో లోతట్టు ప్రాంతాల్లో జీవీఎంసీ మున్సిపల్ కమిషనర్ లక్ష్మీశ పర్యటించారు.
విశాఖపట్నం: నగరంలోని గోపాలపట్నం పరిధిలో లోతట్టు ప్రాంతాల్లో జీవీఎంసీ మున్సిపల్ కమిషనర్ లక్ష్మీశ పర్యటించారు. భగత్ సింగ్ నగర్, ఎస్సీ కాలనీల్లో పర్యటించారు. అనంతరం తుపాన్ పరిస్థితి సమీక్ష నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను పునరావాస కేంద్రాలకు పంపించవలసిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మేఘాద్రి రిజర్వాయర్ నుంచి ఎంఈఎస్ బ్రిడ్జ్ వరకు గెడ్డలో పూడికలు తీయాలని జీవీఎంసీ మున్సిపల్ కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు.