మిగిలిన డిమాండ్ల సంగతి ఏంటి?: Srinivas rao
ABN , First Publish Date - 2021-12-07T18:59:04+05:30 IST
ఉద్యోగులకు సంబంధించి 71 డిమాండ్లలో సీఎం ఒక్క పీఆర్సీపైనే స్పందించారని... మిగిలిన డిమాండ్ల సంగతి ఏంటి అని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ప్రశ్నించారు.
విశాఖపట్నం: ఉద్యోగులకు సంబంధించి 71 డిమాండ్లలో సీఎం ఒక్క పీఆర్సీపైనే స్పందించారని... మిగిలిన డిమాండ్ల సంగతి ఏంటి అని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ప్రశ్నించారు. పీఆర్సీ నివేదికను ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతోందని నిలదీశారు. అంతర్గత సమావేశంలో మాట్లాడిన తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారన్నారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని... లేకుంటే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు శ్రీనివాసరావు స్పష్టం చేశారు.