Visakhapatnam: సింహాచలం దేవస్థానం వద్ద బీజేపీ ధర్నా
ABN , First Publish Date - 2021-12-08T17:47:25+05:30 IST
సింహాచలం దేవస్థానం భూముల పరిరక్షణ కోరుతూ సింహాచలం దేవాలయం తొలి పావంచా వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
విశాఖపట్నం: సింహాచలం దేవస్థానం భూముల పరిరక్షణ కోరుతూ సింహాచలం దేవాలయం తొలి పావంచా వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. భూములు పరిరక్షణ చేయాలని కోరుతూ తొలి పావంచా నుంచి సింహాచలం ఈవో కార్యాలయం పాదయాత్ర చేపట్టారు. అనంతరం ఈవోకి బీజేపీ నేతలు వినతి పత్రం సమర్పించనున్నారు. ఈ ధర్నాలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ మాధవ్, నగర బీజేపీ నేతలు పాల్గొన్నారు.