విశాఖలో బ్యాంకు ఉద్యోగుల ఐక్యవేదిక నిరసన ర్యాలీ
ABN , First Publish Date - 2021-12-16T16:48:02+05:30 IST
బ్యాంకింగ్ చట్టసవరణ బిల్లుకు వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగుల ఐక్యవేదిక నిరసన ర్యాలీ చేపట్టింది.
విశాఖపట్నం: బ్యాంకింగ్ చట్టసవరణ బిల్లుకు వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగుల ఐక్యవేదిక నిరసన ర్యాలీ చేపట్టింది. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా సరస్వతీ పార్క్ నుంచి ర్యాలీ మొదలైంది. అధిక సంఖ్యలో ఉద్యోగులు ర్యాలీలో పాల్గొన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకులను ఎట్టిపరిస్ధితుల్లోనూ ప్రైవేటీకరణకు అంగీకరించమంటూ నినాదాలు చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండే బ్యాకింగ్ వ్యవస్థను దెబ్బతీయొద్దంటూ ప్లకార్డులతో ప్రదర్శన చేపట్టారు.