Visakhaలో తెలుగు మహిళల వినూత్న నిరసన
ABN , First Publish Date - 2021-12-19T19:18:54+05:30 IST
నగరంలో తెలుగు మహిళలు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు.
విశాఖపట్నం: నగరంలో తెలుగు మహిళలు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల పాలు చేస్తోందంటూ భిక్షాటన చేశారు. పదవుల కోసం కాకుండా ప్రత్యేక హోదా, రైల్వేజోన్ కోసం ఎంపీలు పోరాటం చేయాలని తెలుగు మహిళలు డిమాండ్ చేశారు. హోదా సాధించలేకపోతే ఎంపీలు రాజీనామా చేయాలని ప్లకార్డులు, బ్యానర్లతో ప్రదర్శనకు దిగారు.