Visakhaలో ఏపీ ప్రభుత్వ కాంట్రాక్టర్ల ధర్నా
ABN , First Publish Date - 2021-12-29T17:53:19+05:30 IST
విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కాంట్రాక్టర్లు ధర్నాకు దిగారు.
విశాఖపట్నం: విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కాంట్రాక్టర్లు ధర్నాకు దిగారు. నల్ల చొక్కా లతో నాడు పోషకులం, నేడు యాచకులం అంటూ నిరసన తెలిపారు. దీర్ఘకాలిక పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నవరత్నాల్లో మమ్మల్ని కూడా ఒక రత్నం కింద చేర్చి.. దఫ దఫాలుగా, బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్లు కోరుతున్నారు.