Visakhaలో భారీగా నకిలీ కరెన్సీ పట్టివేత
ABN , First Publish Date - 2021-12-31T17:04:01+05:30 IST
నగరంలోని సీతమ్మధారలో భారీగా నకిలీ కరెన్సీ పెట్టుబడింది.
విశాఖపట్నం: నగరంలోని సీతమ్మధారలో భారీగా నకిలీ కరెన్సీ పెట్టుబడింది. 100, 200, 500 డినామినేషన్లో ఉన్న 7.4 లక్షల నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ కరెన్సీని తీసుకువెళ్తున్న రాజాన విష్ణు, యాగంటి ఈశ్వరరావులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిస్సా, జాజ్ పూర్ నుంచి నకిలీ కరెన్సీని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఎంవీపీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.