విశాఖలో సీపీఎం నిరసన
ABN , First Publish Date - 2020-10-21T17:04:15+05:30 IST
పెరిగిన ఉల్లిపాయలు, కూరగాయల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ రైతు బజార్ల వద్ద సీపీఎం నేతలు నిరసనకు దిగారు.
విశాఖపట్నం: పెరిగిన ఉల్లిపాయలు, కూరగాయల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ రైతు బజార్ల వద్ద సీపీఎం నేతలు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ... ఉల్లిపాయలు, నిత్యావసర ధరలు ప్రజలకు అందుబాటులో లేవని..దీని వల్ల పేద, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సబ్సిడీపై ఉల్లిని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కొత్త వ్యవసాయ చట్టం వలనే ధరలు పెరిగాయని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ ధరలతో..ఉల్లి ధరలు పోటీ పడడం దారుణమన్నారు. ధరలు తగ్గించక పోతే..తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని సీపీఎం నేతలు హెచ్చరించారు.