దళిత స్కాలర్ మహేష్ దీక్షకు ఎమ్మెల్యే వెలగపూడి మద్దతు

ABN , First Publish Date - 2020-08-11T18:40:14+05:30 IST

ఏయూకి చెందిన దళిత స్కాలర్ ఆరేటి మహేష్ దీక్షకు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు

దళిత స్కాలర్ మహేష్ దీక్షకు ఎమ్మెల్యే వెలగపూడి మద్దతు

విశాఖపట్నం: ఏయూకి చెందిన దళిత స్కాలర్ ఆరేటి మహేష్ దీక్షకు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ మద్దతు తెలిపారు. మహేష్‌కు సంఘీభావంగా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు మాట్లాడుతూ... ఏయూను వైఎస్సార్ పార్టీ కార్యాలయంగా మార్చారని ఆరోపించారు. దళిత స్కాలర్ మహేష్‌కు న్యాయం జరిగే వరకూ అండగా ఉంటామని స్పష్టం చేశారు. థీసిస్ సబ్ మిట్ చేసిన తర్వాత అతనిపై కక్ష సాధింపు దుర్మార్గమని మండిపడ్డారు. మహేష్‌కు అడ్మిషనే లేదని కొంతమంది ప్రొఫెసర్లు అనడం తగదని ఎమ్మెల్యే తెలిపారు. మహేష్‌కు అడ్మిషన్ ఇవ్వకపోతే ఐసీఎస్‌ఎస్‌ఆర్ ఢిల్లీ నుంచి స్టైఫండ్ రూ.96 వేలు ఎలా మంజూరైందని ఎమ్మల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ప్రశ్నించారు. 


టీఎన్ఏస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ...

దళిత స్కాలర్ ఆమరణ దీక్ష రెండో రోజుకు చేరుకుందని...అతనికి న్యాయం చేస్తామని ఇంత వరకూ ఎవరూ ముందుకు రాలేదని మండిపడ్డారు. మహేష్‌కు న్యాయం జరిగే వరకు టీఎన్ఎస్ఎఫ్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Updated Date - 2020-08-11T18:40:14+05:30 IST