అల్లూరి కుటుంబ సభ్యులను సత్కరించిన ఉపరాష్ట్రపతి
ABN , First Publish Date - 2022-04-19T16:48:40+05:30 IST
విశాఖ: ఆజాది అమృత్ మహోత్సవంలో భాగంగా సమరయోధులను సత్కరించిన కార్యక్రమానికి...
విశాఖ: ఆజాది అమృత్ మహోత్సవంలో భాగంగా సమరయోధులను సత్కరించిన కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు హాజరయ్యారు. స్వతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు జన్మస్థలం పాండ్రంగి చేరుకున్న ఉప రాష్ట్రపతి, గవర్నర్.. అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం అల్లూరు కుటుంబ సభ్యులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు.