వివేకా హత్య కేసు డైవర్ట్ చేయడానికే జగన్ ఈ ప్రకటన..: టీడీపీ

ABN , First Publish Date - 2021-11-22T19:38:16+05:30 IST

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును పక్కదారి పట్టించడానికే మూడు రాజధానుల బిల్లును..

వివేకా హత్య కేసు డైవర్ట్ చేయడానికే జగన్ ఈ ప్రకటన..: టీడీపీ

విశాఖ: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును పక్కదారి పట్టించడానికే మూడు రాజధానుల బిల్లును సీఎం జగన్ వెనక్కి తీసుకున్నట్లు అనిపిస్తోందని టీడీపీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా వారు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ సీఆర్డీయే చట్టం ఉందని, రాజధాని అంశం కోర్టు పరిధిలో ఉందని, రైతులు పోరాటం చేస్తున్నారని అన్నారు. ఈ సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఏది ఏమైనా రాష్ట్రానికి ఒకే రాజధాని స్థిరంగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. మూడు రాజధానుల నుంచి ఒక రాజధానికి రావడం సంతోషించదగ్గ విషయమన్నారు. ప్రభుత్వ నిర్ణయం.. రైతుల త్యాగాలకు ఫలితంగా తాము భావిస్తున్నామని టీడీపీ నేతలు అన్నారు. 

.

మూడు రాజధానుల చట్టాలను ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుందని అమరావతి రాజధాని కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనానికి ఏపీ అడ్వకేట్‌ జనరల్‌ సోమవారం ఈ విషయాన్ని తెలియజేశారు. ఏజీ ప్రతిపాదనను విన్న ధర్మాసనం తదుపరి విచారణను మధ్యాహ్నం 2:15కి వాయిదా వేసింది. 

Updated Date - 2021-11-22T19:38:16+05:30 IST