నర్సీపట్నంలో మహారాష్ట్ర గంజాయి ముఠా బీభత్సం
ABN , First Publish Date - 2022-01-25T16:31:16+05:30 IST
నర్సీపట్నంలో మహారాష్ట్రకు చెందిన గంజాయి ముఠా బీభత్సం సృష్టించింది.
విశాఖ జిల్లా: నర్సీపట్నంలో మహారాష్ట్రకు చెందిన గంజాయి ముఠా బీభత్సం సృష్టించింది. ఈ ముఠా ప్రయాణిస్తున్న వాహనంలో గంజాయి తరలిస్తున్నట్లు ట్రాఫిక్ ఎస్ఐ గుర్తించారు. దాంతో ఎస్ఐ ఆ వాహనాన్ని వెంబడించి పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఇది పసిగట్టిన స్మగ్లర్లు కారు మరింత వేగంగా నడిపి, ఇతర వాహనాలను ఢీ కొట్టారు. ఈ క్రమంలో కారు వదిలేసి స్మగ్లర్లంతా చెరువులోకి దూకారు. ఈ విషయాన్ని ట్రాఫిక్ ఎస్ఐ, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారంతా ఘటనాస్థలికి చేరుకున్నారు. చెరువు చుట్టూ పోలీసులు మోహరించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.