జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద టీడీపీ నిరసన

ABN , First Publish Date - 2021-10-30T16:22:58+05:30 IST

జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద విశాఖ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు.

జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద టీడీపీ నిరసన

విశాఖపట్నం: జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద టీడీపీ విశాఖ పార్లమెంట్ ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో  టీడీపీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, నగర టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొని వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. సీఎం జగన్ అనాలోచిత చర్యలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం ఎయిడెడ్ విద్యాసంస్థలను కొనసాగించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. 


Updated Date - 2021-10-30T16:22:58+05:30 IST