విశాఖ కేంద్ర కారాగారం నుంచి 26 మంది జీవిత ఖైదీలు విడుదల!
ABN , First Publish Date - 2020-08-12T12:52:49+05:30 IST
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ కేంద్ర కారాగారం నుంచి..
ఆరిలోవ(విశాఖపట్నం): స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ కేంద్ర కారాగారం నుంచి 26 మంది జీవిత ఖైదీలు విడుదలయ్యే అవకాశం ఉందని జైలు సూపరింటెండెంట్ రాహుల్ మంగళవారం తెలిపారు. ఈ అంశంపై ఇప్పటికే అధికారులతో సమావేశం కూడా జరిగిందన్నారు. 2019లో ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం జాబితాను సిద్ధం చేశామన్నారు.