ఉద్యోగుల పట్ల జగన్ ప్రేమ తేటతెల్లమైంది: విష్ణుకుమార్ రాజు

ABN , First Publish Date - 2022-01-20T17:45:19+05:30 IST

ఉద్యోగుల పట్ల, సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రేమ తేటతెల్లమైందని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు.

ఉద్యోగుల పట్ల జగన్ ప్రేమ తేటతెల్లమైంది: విష్ణుకుమార్ రాజు

అమరావతి: ఉద్యోగుల పట్ల, సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రేమ తేటతెల్లమైందని  బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగస్తులను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా ముంచేసిందని మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి సిగ్గులేదు.. ప్రతిదీ  దగా, మోసం చేస్తుందన్నారు. ఉద్యోగస్తులకు బీజేపీ పూర్తి మద్దతు ఇస్తుందన్నారు.  ప్రజలను ఇబ్బంది పెట్టే, వాటినే సీఎం జగన్మోహన్‌రెడ్డి అమలుచేస్తున్నారని దుయ్యబట్టారు.


స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత దారుణమైన పరిస్థితి ఏ రాష్ట్రంలోనూ చూడలేదన్నారు. ఇలాంటి రాక్షస పాలన చరిత్రలో ఎక్కడ జరగలేదన్నారు.ఈ పోస్ట్ కి జగన్ రాజీనామా చేసి వేరే రాష్ట్రానికి వెళ్లి పాలన చేయాలని హితవు పలికారు. ఏపీలో అన్ని రేట్లను పెంచేసి ఉద్యోగులకు మాత్రం జీతాలు తగ్గిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో వేంకటేశ్వరస్వామి ఆలయం ప్రారంభానికి కూడా ముఖ్యమంత్రికి రెండు  గంటల సమయం లేదా అని ప్రశ్నించారు. ఇలాంటి గొప్ప వ్యక్తినీ ఏ జన్మ లోనూ చూడలేమేమోనని సీఎం జగన్మోహన్‌రెడ్డిని ఉద్దేశించి విష్ణుకుమార్ రాజు ఎద్దేవా చేశారు. 

Updated Date - 2022-01-20T17:45:19+05:30 IST