ఫిర్యాదులన్నీ పరిశీలిస్తాం: జాతీయ ఎస్సీ కమిషన్

ABN , First Publish Date - 2021-08-24T21:20:47+05:30 IST

విజయవాడ: తమ దృష్టికి వచ్చిన ఫిర్యాదులన్నింటినీ పరిశీలిస్తామని జాతీయ ఎస్సీ కమిషన్ ఉపాధ్యక్షుడు అరుణ్ హల్దార్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ ఇతర కేసులు చాలా వచ్చాయన్నారు.

ఫిర్యాదులన్నీ పరిశీలిస్తాం: జాతీయ ఎస్సీ కమిషన్

విజయవాడ: తమ దృష్టికి వచ్చిన ఫిర్యాదులన్నింటినీ పరిశీలిస్తామని జాతీయ ఎస్సీ కమిషన్ ఉపాధ్యక్షుడు అరుణ్ హల్దార్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ దృష్టికి ఇతర కేసులు కూడా చాలా వచ్చాయన్నారు. ఒక్కో కేసును లోతుగా పరిశీలించి, తర్వాత తమ అభిప్రాయం చెబుతామని తెలిపారు. కేసులను త్వరగా పరిశీలించడానికి.. రాష్ట్రంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలనే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. తమకు వచ్చిన ఫిర్యాదులపై ఢిల్లీ వెళ్లగానే.. కేస్ టూ కేస్ స్టడీ చేస్తామని, అలాగే వాటిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారనే విషయంపై విచారిస్తామని తెలిపారు. మంచి చేస్తే మంచి అని.. తప్పు చేస్తే తప్పు అని చెబుతామని అరుణ్ హల్దార్ పేర్కొన్నారు. జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు మంగళవారం గుంటూరు పర్యటించారు. రమ్య హత్య కేసుపై కూడా విచారణ చేపట్టారు.

Updated Date - 2021-08-24T21:20:47+05:30 IST