విషీ సారథ్యంలో చెస్ ఒలింపియాడ్కు
ABN , First Publish Date - 2021-08-01T09:19:02+05:30 IST
దిగ్గజ గ్రాండ్మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ నాయకత్వంలో ఫిడే ఆన్లైన్ చెస్ ఒలింపియాడ్లో తలపడేందుకు భారత బృందం సిద్ధమవుతోంది. వచ్చేనెల 8 నుంచి 15 వరకు ఆన్లైన్లో జరగనున్న ఈ టోర్నీలో...
న్యూఢిల్లీ: దిగ్గజ గ్రాండ్మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ నాయకత్వంలో ఫిడే ఆన్లైన్ చెస్ ఒలింపియాడ్లో తలపడేందుకు భారత బృందం సిద్ధమవుతోంది. వచ్చేనెల 8 నుంచి 15 వరకు ఆన్లైన్లో జరగనున్న ఈ టోర్నీలో భారత్ డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగనుంది. ఆనంద్తో పాటు, తెలుగు గ్రాండ్ మాస్టర్లు హరికృష్ణ, హంపి, హారిక, విదిత్ సంతోష్ గుజరాతి, నిహాల్ సరిన్, ప్రజ్ఞానంద, తానియా సచ్దేవ్, భక్తి కులకర్ణి, వైశాలి, సవితా శ్రీ ఒలింపియాడ్లో పోటీపడనున్నారు.