విషీ సారథ్యంలో చెస్‌ ఒలింపియాడ్‌కు

ABN , First Publish Date - 2021-08-01T09:19:02+05:30 IST

దిగ్గజ గ్రాండ్‌మాస్టర్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ నాయకత్వంలో ఫిడే ఆన్‌లైన్‌ చెస్‌ ఒలింపియాడ్‌లో తలపడేందుకు భారత బృందం సిద్ధమవుతోంది. వచ్చేనెల 8 నుంచి 15 వరకు ఆన్‌లైన్‌లో జరగనున్న ఈ టోర్నీలో...

విషీ సారథ్యంలో చెస్‌ ఒలింపియాడ్‌కు

న్యూఢిల్లీ: దిగ్గజ గ్రాండ్‌మాస్టర్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ నాయకత్వంలో  ఫిడే ఆన్‌లైన్‌ చెస్‌ ఒలింపియాడ్‌లో తలపడేందుకు భారత బృందం సిద్ధమవుతోంది. వచ్చేనెల 8 నుంచి 15 వరకు ఆన్‌లైన్‌లో జరగనున్న ఈ టోర్నీలో భారత్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. ఆనంద్‌తో పాటు, తెలుగు గ్రాండ్‌ మాస్టర్లు హరికృష్ణ, హంపి, హారిక, విదిత్‌ సంతోష్‌ గుజరాతి, నిహాల్‌ సరిన్‌, ప్రజ్ఞానంద, తానియా సచ్‌దేవ్‌, భక్తి కులకర్ణి, వైశాలి, సవితా శ్రీ ఒలింపియాడ్‌లో పోటీపడనున్నారు.  

Updated Date - 2021-08-01T09:19:02+05:30 IST