వివాహిత ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-10-17T06:17:31+05:30 IST
వివాహిత ఆత్మహత్య
హనుమాన్జంక్షన్ రూరల్, అక్టోబరు 16 : భార్యాభర్తల మధ్య మనస్పర్థల నేపథ్యంలో భార్య పురు గుల మందు తాగి మృతి చెందిన ఘటన శుక్రవారం ఆరుగొలనులో జరిగింది. పోలీసులు కథనం మేరకు.. ఆరు గొలనుకు చెందిన బాపూజీ శిరీషలు భార్యభర్తలు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావటంతో శిరీష శుక్రవారం పురు గులు మందు తాగింది. జంక్షన్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. వీరికి ఇద్దరు సంతానం, మృతురాలి తండ్రి అడపా వెంకటేశ్వ రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉషారాణి తెలిపారు.