వివేకా హత్యకేసులో కీలక మలుపు
ABN , First Publish Date - 2021-08-18T23:25:38+05:30 IST
మాజీమంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో కీలక మలుపు తిరుగుతోంది. అనుమానితుడు సునీల్ యాదవ్కు నార్కో అనాలసిస్ పరీక్షల అనుమతి కోరుతూ
కడప: మాజీమంత్రి వైఎస్ వివేకా హత్యకేసు కీలక మలుపు తిరుగుతోంది. అనుమానితుడు సునీల్ యాదవ్కు నార్కో అనాలసిస్ పరీక్షల అనుమతి కోరుతూ సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. పులివెందుల కోర్టు మేజిస్ట్రేట్ సెలవుపై వెళ్లడంతో జమ్మలమడుగు కోర్టులో వాదనలు జరిగాయి. సునీల్ తరపు న్యాయవాది హితేష్ కుమార్, సీబీఐ అధికారులు హాజరైనారు. కేసు విచారణ ఈ నెల 27కి వాయిదా పడింది. ప్రస్తుతం కడప సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా సునీల్ ఉన్నాడు. కేసు విచారణ అనంతరం సునీల్కు కడప సెంట్రల్ జైలుకు తరలించారు.
ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి తండ్రి, వైసీపీ పులివెందుల ఇన్చార్జి వైఎస్ భాస్కరరెడ్డిని సీబీఐ మరోసారి విచారించింది. భాస్కర్రెడ్డి సోదరుడు వైఎస్ మనోహర్రెడ్డిని కూడా మరోసారి సీబిఐ బృందం విచారిస్తోంది. భాస్కర్రెడ్డి, మనోహర్రెడ్డిలను సీబీఐ విచారిస్తున్న నేపథ్యంలో కడపలో సీబీఐ అధికారులను వివేకా కుమార్తె సునీత కలిశారు.