వివేకా కేసు విచారణ వేగవంతం
ABN , First Publish Date - 2020-09-21T08:25:22+05:30 IST
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరుగురిని సీబీఐ విచారించింది. ఆదివారం కడప
ఆరుగురిని విచారించిన సీబీఐ
కడప (క్రైం), సెప్టెంబరు 20: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరుగురిని సీబీఐ విచారించింది. ఆదివారం కడప కేంద్ర కారాగారం, ఆర్ అండ్ బీ అతిథిగృహాల్లో రెండు బృందాలుగా విడిపోయిన అధికారులు ఈ విచారణను కొనసాగించారు.
మాజీమంత్రి హత్య కేసులో పలువురు అనుమానితులకు సీబీఐ అధికారులు ఇదివరికే నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈరోజు విచారణను ఎదుర్కొన్నవారిలో ఇరువురు మహిళలు ఉన్నారనీ, వారిలో ఒకరు కీలకమైన వ్యక్తి అని తెలుస్తోంది. నేడో, రేపో మరికొందరిని విచారించే అవకాశం ఉనట్లు సమాచారం.