వివేకా హత్యకేసు.. సునీల్ వర్సెస్ సీబీఐ

ABN , First Publish Date - 2021-07-27T16:51:44+05:30 IST

వైఎస్ వివేకా హత్యకేసులో విచారణను ఎదుర్కొంటున్న సునీల్ వర్సెస్ సీబీఐగా మారింది.

వివేకా హత్యకేసు.. సునీల్ వర్సెస్ సీబీఐ

కడప జిల్లా: వైఎస్ వివేకా హత్యకేసు సునీల్ వర్సెస్ సీబీఐగా మారింది. సీబీఐ అధికారులు విచారణ పేరుతో తన కుటుంబాన్ని వేధిస్తున్నారని సునీల్ కుటుంబంతో పాటు మరో ముగ్గరు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆ పిటీషనర్ల ఆరోపణలు అవాస్తవమని, నిరాధారమైనవని సీబీఐ తరుపు న్యాయవాది చెన్నకేశవులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కౌంటర్ వేసేందుకు కొంత సమయమివ్వాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఉన్నత న్యాయస్ధానం తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది. 

Updated Date - 2021-07-27T16:51:44+05:30 IST