పిచ్‌పై ఏడుపెందుకు?

ABN , First Publish Date - 2021-03-02T06:56:42+05:30 IST

మూడో టెస్టు పిచ్‌పై ఇంగ్లండ్‌ మాజీలు చేస్తున్న విమర్శలకు వెస్టిండీస్‌ దిగ్గజం వివియన్‌ రిచర్డ్స్‌ ఘాటుగా స్పందించాడు. చివరి టెస్టుకు కూడా స్పిన్‌ ట్రాక్‌నే రూపొందించాలని సూచించాడు...

పిచ్‌పై ఏడుపెందుకు?

న్యూఢిల్లీ: మూడో టెస్టు పిచ్‌పై ఇంగ్లండ్‌ మాజీలు చేస్తున్న విమర్శలకు వెస్టిండీస్‌ దిగ్గజం వివియన్‌ రిచర్డ్స్‌ ఘాటుగా స్పందించాడు. చివరి టెస్టుకు కూడా స్పిన్‌ ట్రాక్‌నే రూపొందించాలని సూచించాడు. పిచ్‌పై ఫిర్యాదు చేయకుండా బ్యాట్స్‌మెన్‌ దేనికైనా సిద్ధంగా ఉండాలని హితవు పలికాడు. ‘ఇటీవలి కాలంలో భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య జరిగిన రెండు, మూడో టెస్టు గురించి చాలా ప్రశ్నలు ఎదుర్కొన్నా. పిచ్‌పై ఎవరైతే ఏడుస్తున్నారో వారికి ఓ విషయం చెప్పదలుచుకున్నా. భారత్‌లో ఆడాలంటే స్పిన్‌ను ఎదుర్కోవాలనే విషయం మర్చిపోతున్నారు. ఆ ట్రాక్‌లపై ఎలా ఆడాలో ముందు ప్రాక్టీస్‌ చేయండి’ అని రిచర్డ్స్‌ చురకంటించాడు.


Updated Date - 2021-03-02T06:56:42+05:30 IST