వొడాఐడియా చార్జీల పెంపు
ABN , First Publish Date - 2021-11-24T09:02:22+05:30 IST
వొడాఫోన్ ఐడియా మంగళవారం ప్రీ పెయిడ్ మొబైల్ కాల్, డేటా టారిఫ్స్ను 18 నుంచి 25 శాతం మేరకు పెంచింది. ...
న్యూఢిల్లీ: వొడాఫోన్ ఐడియా మంగళవారం ప్రీ పెయిడ్ మొబైల్ కాల్, డేటా టారిఫ్స్ను 18 నుంచి 25 శాతం మేరకు పెంచింది. ఈ నెల 25 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి. భారతి ఎయిర్టెల్ చార్జీలు పెంచిన ఒక రోజు వ్యవధిలోనే వొడాఐడియా చార్జీలు పెంచటం గమనార్హం. వొడాఐడియా తాజా నిర్ణయంతో కనీస రీచార్జి (28 రోజులు) ధర 25.31 శాతం మేర పెరిగింది. దీంతో కనీస రీచార్జీ ధర రూ.79 నుంచి రూ.99కి పెరిగిందని పేర్కొంది. అన్లిమిటెడ్ ప్లాన్లను 20 నుంచి 23 శాతం మేరకు చార్జీలు పెంచగా.. టాప్అప్ డేటా కనీస విలువను 20 శాతం పెంచింది. 24 జీబీ డేటా పరిమితి గల ఏడాది కాలపరిమితితో కూడిన టాప్అప్ విలువ రూ.1,499 నుంచి రూ.1,799కి పెరుగుతుంది. ఇతర డేటా టాప్ అప్ ప్లాన్లు కూడా 18 నుంచి 20 శాతం మేరకు పెరిగాయి.