వాలీబాల్ టోర్నీ విజేత పుట్టపర్తి జట్టు
ABN , First Publish Date - 2021-10-18T05:57:28+05:30 IST
నియోజకవర్గ స్థాయి ఫ్రెండ్స్ వాలీబాల్ టోర్నమెంట్ విజేతగా పుట్టపర్తి ఎనుములవారిపల్లి జట్టు విజయం సాధించింది.
ఓబుళదేవరచెరువు, అక్టోబరు 17: నియోజకవర్గ స్థాయి ఫ్రెండ్స్ వాలీబాల్ టోర్నమెంట్ విజేతగా పుట్టపర్తి ఎనుములవారిపల్లి జట్టు విజయం సాధించింది. గత మూడు రోజులుగా మండల కేంద్రంలోని భారతీయ స్టేట్బ్యాంక్ వెనుక వైపు క్రీడా మైదానంలో డాక్టర్ ఫజుల్అలీఖాన్, టైలర్ మహమ్మద్ జ్ఞాపకార్థం వారి కుమారులు లడ్డుబాబ్జాన్, ఇమ్రాన్ఖాన్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఈ టోర్నీలో నియోజకవర్గ స్థాయిలో 18 జట్లు పాల్గొనగా, ఆదివారం ఫైనల్స్లో పుట్టపర్తి ఎనుములవారిపల్లి, ఓబుళదేవరచెరువు జట్లు తలపడగా ఓడీసీ జట్టుపై పుట్టపర్తి ఎనుములవారిపల్లి జట్టు గెలుపొందింది. వీరికి విన్నర్స్ ట్రోఫీతో పాటు రూ. 10116 నగదును కెప్టెన్ రాజాకు నిర్వాహకులు, ఎంపీపీ తుమ్మల పర్వీన్షామీర్, వైసీపీ రాష్ట్ర నాయకులు షామీర్బాషా, జిల్లా కార్యదర్శి తుమ్మల బాబాఫక్రొద్దీన్ అందజేశారు. రన్నర్స్ విజేతగా ఓబుళదేవరచెరువు జట్టుకు రూ. 5116, షీల్డ్లను, మూడో బహుమతిగా కొండకమర్ల జట్టుకు రూ.3116 అందజేశారు. వాలీబాల్ టోర్నీ స్పాన్సర్ హరినాథ్రెడ్డికి ఎంపీపీ, ఓడీసీ యువసైన్యం సభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీతో పాటు మి ట్టపల్లి సర్పంచు షాజీదా, వైసీపీ నాయకులు మజీద్, ఆనంద్రెడ్డి, విక్టర్ మధు, తల సాని సతీష్రెడ్డి, పీఈటీలు రాజేష్, సాధిక్, శంకర్నారాయణ, వెన్నెల అస్లాం, 108 అబ్లు, అగ్రికల్చర్ బాబ్జాన్, రాష్ట్ర రైతు సంఘం నాయకులు ఆకుతోట రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.