వలంటీర్ వేధింపులు.. మాజీ మంత్రి బండారు డ్రైవర్ ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-05-30T15:58:11+05:30 IST
అచ్యుతాపురం మండలం నునపర్తిలో దారుణం జరిగింది. వలంటీర్ జాగరపు నర్సింగరావు వేధింపులు భరించలేక సన్యాసినాయుడు
విశాఖ: అచ్యుతాపురం మండలం నునపర్తిలో దారుణం జరిగింది. వలంటీర్ జాగరపు నర్సింగరావు వేధింపులు భరించలేక సన్యాసినాయుడు అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు హుటాహుటినా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. దీంతో కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వలంటీర్పై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇంటి నిర్మాణానికి అడ్డుతగులుతూ వలంటీర్ నరసింగరావు వేధిస్తున్నాడంటూ ఆడియోలో తన గోడును సన్యాసినాయుడు రికార్డు చేశాడు.
నా డ్రైవర్ను వలంటీర్ బలితీసుకున్నాడు: బండారు
డ్రైవర్ సన్యాసినాయుడు 18 ఏళ్లుగా తన దగ్గర డ్రైవర్గా పని చేస్తున్నాడని మాజీ మంత్రి, టీడీపీ నేత బండారు సత్యానారాయణ తెలిపారు. మంచి వ్యక్తి అని, సొంత కొడుకులా చూసుకున్నామని కంటతడి పెట్టారు. అలాంటి వ్యక్తిని వలంటీర్ వేధించాడని ఆవేదన వ్యక్తం చేశారు. వలంటీర్ వేధిస్తున్నాడని అచ్యుతాపురం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. వలంటీర్ల వల్ల ఇంకెంత మంది చావాలని ప్రశ్నించారు?, అసలు వలంటీర్లు వేధించడమేంటి? అని నిలదీశారు. ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు వలంటీర్లు ఎందుకు తీసుకురావాలని బండారు మండిపడ్డారు.