వలంటీర్ల సేవలు అమూల్యం : ఎమ్మెల్యే దూలం
ABN , First Publish Date - 2021-04-16T06:52:01+05:30 IST
సంక్షేమ ఫలాలను ప్రజలకు అంది ంచడంలో వలంటీర్ల సేవలు అభినం దనీయమని ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు అన్నారు. కైకలూరు ట్రావెలర్స్ బంగళాలో నియోజకవర్గ స్ధాయిలో వార్డు, గ్రామ వాలంటీర్లకు సేవా మిత్ర, సేవారత్న,సేవా వజ్ర పురస్కారాలను అందజేశారు.
కైకలూరు : సంక్షేమ ఫలాలను ప్రజలకు అంది ంచడంలో వలంటీర్ల సేవలు అభినం దనీయమని ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు అన్నారు. కైకలూరు ట్రావెలర్స్ బంగళాలో నియోజకవర్గ స్ధాయిలో వార్డు, గ్రామ వాలంటీర్లకు సేవా మిత్ర, సేవారత్న,సేవా వజ్ర పురస్కారాలను అందజేశారు.జిల్లా పరిషత్ సీఈవో సూర్యప్రకాశ్, డీఎస్పీ ఎం .సత్యానందం ఈ పురస్కారాలను అందజేశారు. వడ్డి కార్పొరేషన్ చైర్మన్ సైదు గాయత్రి సంతోషి, సర్పంచ్ డి.నవరత్నకుమారి, వైసీపీ నాయకులు అడవికృష్ణ, ఎమ్డీవోలు, తహసీల్దార్ ,వివిధశాఖాధికారులు పాల్గొన్నారు. ముదినేపల్లి : మండలంలోని అయిదుగురు వలంటీర్లకు సేవారత్న అవార్డులు లభించాయి. పెదగొన్నూరు గ్రామానికి చెందిన తణుకుల లావణ్య, గుడిసేవ వల్లీ, కోడూరు గ్రామ వలంటీర్ డొక్కుమాల కుమారి, కొరగుంటపాలెం వలంటీర్ పిడిగె సునీత, పెయ్యేరుకు చెందిన పొట్నూరి శైలజకు సేవా వజ్ర అవార్డులు లభించాయి. ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఈ అవార్డులు, ప్రశం సాపత్రాలు అందజేశారు. వైసీపీ నాయకులు బొర్రా శేషు, రామిశెట్టి సత్య నారాయణ, శీలం రామకృష్ణ, ఎంపీడీవో జి.మాధవరావు తదితరులు అభినందించారు.