నేడు పండు వెన్నెలలో ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణం
ABN , First Publish Date - 2020-04-07T18:01:54+05:30 IST
కడప: నేడు ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణాన్ని ఆలయ అధికారులు నిర్వహించనున్నారు.
కడప: నేడు ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణాన్ని ఆలయ అధికారులు నిర్వహించనున్నారు. పౌర్ణమి సందర్భంగా నేటి రాత్రి పండు వెన్నెలలో చంద్రుడు తిలకించేలా సీతారామ కల్యాణాన్ని నిర్వహిస్తారు. కరోనా ఎఫెక్ట్ కారణంగా.. హంగూఆర్భాటాలు, భక్తులు లేకుండా ఆలయ అర్చకులు, గ్రామపెద్దల సమక్షంలో మాత్రమే రాములవారి కల్యాణాన్ని ఆలయ అధికారులు నిర్వహించనున్నారు. ఆలయ ప్రాంగణంలోనే టీటీడీ అధికారులు కల్యాణం ఏర్పాట్లను చేశారు.