Delhi: ఓటుకు నోటు కేసుపై సుప్రీం కోర్టులో విచారణ
ABN , First Publish Date - 2021-12-01T19:15:52+05:30 IST
ఓటుకు నోటు కేసు వ్యవహారంలో రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య వేసిన పిటిషన్లపై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
న్యూఢిల్లీ: ఓటుకు నోటు కేసు వ్యవహారంలో రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య వేసిన పిటిషన్లపై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసు నుంచి తన పేరును తొలగించాలని సండ్ర, ఈ కేసు విచారణ అవినీతి నిరోధక చట్టానికి వర్తించదంటూ రేవంత్ రెడ్డి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఇరువురూ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను జనవరి 27కు వాయిదా వేసింది. తదుపరి విచారణ వరకు గతంలో ఇచ్చిన ఉత్తర్వులే కొనసాగుతాయని సుప్రీంకోర్టు తెలిపింది.